21-06-2025 12:00:00 AM
అదనపు కలెక్టర్ దీపక్ తివారి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 20 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధి దిశగా అనేక చర్యలు చేపడుతుందని, ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు రుణ సదుపాయం కల్పించి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు.
శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రిసోర్స్ పర్సన్లు, మెప్మా సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళలకు రుణ సదుపాయం కల్పించి ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా ప్రోత్సహించాలని తెలిపారు.
స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ 170 లక్ష్యం కాగా ఇప్పటివరకు 12 గ్రూపుల వారు లింకేజీ పూర్తి చేశారని, మిగిలిన 158 స్వయం సహాయక సంఘాల లింకేజీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, నూతన సంఘాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. క్రొత్తగా వివాహం అయిన వారిని గ్రూపులో సభ్యురాలుగా చేర్పించాలని, గ్రూపు సభ్యుల ఆధార్ సీడింగ్ ప్రక్రియలో 823 మందికి గాను 819 మంది ఆధార్ సీడింగ్ పూర్తి చేశారని తెలిపారు.
ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా గ్రూప్ ఎంట్ర్పజెస్, వ్యక్తిగత ఎంట్ర్పజెస్ నిర్వహించాలని, ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద పి.వి.టి.జి. లలో సభ్యు లు లేని వారిని గుర్తించి గ్రూపులలో చేర్పించాలని తెలిపారు. ప్రధానమంత్రి జుగా క్రింద ఇతర గిరిజన మహిళలను సంఘాలలో సభ్యులుగా చేర్పించాలని, ప్రధాన మంత్రి స్వ నిధి, సమృద్ధి నిధి, విశ్వకర్మ పథకాలపై మహిళలకు అవగాహన కల్పించాల ని తెలిపారు.
కాగజ్ నగర్ మున్సిపాలిటీలో 170 మహిళా సంఘాలు ఉన్నాయని, ఆసిఫాబాద్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పా టు అయినందున మెప్మా సిబ్బంది గ్రూపుల వివరాలను సమీక్షించాలని తెలిపారు. మహిళల ఆర్థిక అభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ మోతిరామ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, అదనపు గ్రామీణ అభివృద్ధి అధికారి రామకృష్ణ, డి పి ఎం లు, స్త్రీ నిధి మేనేజర్లు తదితరులు పాల్గొన్నారు