calender_icon.png 21 June, 2025 | 9:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

21-06-2025 12:00:00 AM

అదిలాబాద్, జూన్ 20 (విజయ క్రాంతి) :  ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఫోక్సో కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటానని హల్చల్ వేయడం కలకలం రేపింది. ఇచ్చోడ సీఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం... గుడిహత్నూర్ మండల కేంద్రానికి చెందిన అరుణ్ పై గతంలో ఫోక్సో కేసు నమోదు అయింది. ఐతే కోర్టు విచారణకు నిందితుడు హాజరు కాకపోవడంతో నాన్ బెయిలబుల్  వారెంట్ జారీ అయ్యింది.

దింతో పరారీలో ఉన్న నిం దితుడు శుక్రవారం బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాడన్న సమాచారంతో నిందితు న్ని పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా నిందితుడు అరుణ్ తనను పట్టుకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులను బెదిరి స్తూ కాసేపు హల్ చల్ చేసాడు.

పోలీసులు అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించగా తన వద్ద బ్లేడుతో గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గొంతు పై ఉన్న చర్మం కొద్దిగా దిగడంతో రక్తస్రావం అయింది. వెంటనే పోలీసులు నిందితున్ని ఆసుపత్రికి తరలించారు. కాగా గతంలో సైతం నిందితుడు  బ్లేడుతో హల్చల్ చేశారని సీఐ తెలిపారు.