05-02-2026 04:49:49 PM
టీ-20 ప్రపంచకప్ లో భారత్ తో ఆడేందుకు పాకిస్థాన్ నిరాకరణపై కెప్టెన్ సూర్యకుమార్(Captain Suryakumar) స్పందించారు. పాక్ తో టీ 20 ప్రపంచకప్ ఆడబోమని తాము చెప్పలేదని సూర్యకుమార్ స్పష్టం చేశారు. పాక్ మాత్రం భారత్ తో టీ 20 ప్రపంచకప్ ఆడబోమని చెప్పిందన్నారు. భారత్-పాక్ టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ కు ఐసీసీ షెడ్యూల్ చేసిందని సూర్యకుమార్ వెల్లడించారు. పాకిస్థాన్ తో ఆడేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత కెప్టెన్ ప్రకటించారు. ఇప్పటికే తమ విమాన టికెట్లు కూడా బుక్ అయ్యాయని వివరించారు. టీ 20 ప్రపంచకప్ మ్యాచ్ ఆడేందుకు కొలొంబో వెళ్తున్నామన్నారు.