21-06-2025 12:21:31 AM
కొత్తగూడెం జూన్ 20 (విజయ క్రాంతి,) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరీపేట గ్రామం పరిధిలోని పో తులూరి కుంట చెరువును అధికార పార్టీకి చెందిన ఒక నాయకుడు ఆక్రమిస్తున్నట్లు ఆ రోపణలు వెలబడుతున్నాయి. ఆ యొక్కటుదారులు ఇప్పటికే పోలీసు, రెవెన్యూ, నీటిపా రుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఆక్రమణలు ఏదేచగా సాగుతున్నాయి అన్నా రు.
పోతులూరి కుంట ఆధారంగా కొన్ని కు టుంబాలు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తున్నాయి. హైడ్రా వంటి చట్టాలు ఎన్ని వచ్చిన అధికారులకు చుట్టాలుగా మారాయని రైతులు వాపోతున్నారు. గత రెండు రోజులుగా అధికార పార్టీకి చెందిన ఓ నా యకుడు ఏడు ఎకరాల వరకు చెరువును లెవెల్ చేసి కంచెను పాతటం గమనార్హం.
విషయం తెలుసుకున్న మీడియా మిత్రులు సంఘటన స్థలానికి చేరుకోగా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేశారని తెలుస్తోంది. దర్జాగా చెరువునే పోల్చు కుంటూ కంచని పాదుతున్నారని వారు ఆ రోపించారు. తక్షణమే అధికారులు స్పందిం చి చెరువు సంరక్షించాలని, ఆక్రమణదారులను చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.