calender_icon.png 21 June, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేటులో ప్రభుత్వ టీచర్ల పెట్టు‘బడులు’.!

21-06-2025 12:22:15 AM

  1. రియల్ ఎస్టేట్, చిట్టిల వ్యాపారాల నుండి ప్రైవేట్ పాఠశాలకు పెట్టుబడుల వైపు అడుగులు.
  2. రాజకీయ, ఉపాధ్యాయ సంఘ నేతల అండతో వ్యాపారం. 
  3.  ఆరోగ్య కారణాలంటూ డిప్యూటేషన్లు.
  4. ప్రభుత్వ పాఠశాలలకు తరచూ డుమ్మాలు.
  5. ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తున్న పంతుళ్లు
  6. ప్రైవేట్ లో ఎల్కేజీ నుంచి దోపిడీ

నాగర్ కర్నూల్ జూన్ 20 ( విజయక్రాంతి ): గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్త్మ్ర శ్రీ గురవే నమః‘ విద్యను అందించే గురువు సాక్షాత్తు దైవంతో సమానం అని నానుడి మాట. కానీ నేడు విద్యను వ్యాపారంగా మలుచుకున్న కార్పొరేట్ వ్యవస్థలతో చేతులు కలిపి ప్రభుత్వ పాఠశాలలో పేద వి ద్యార్థులకు విద్యను అందించే ఉపాధ్యాయు లే నేడు పెట్టుబడులు పెట్టి ప్రైవేటు పాఠశాలకు పేద విద్యార్థులను బలవంతంగా సా గనంపుతున్నారని జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పాఠశాలలో ఈసారి విద్యార్థుల చేరిక సంఖ్య ఘ ననీయంగా తగ్గిందని చర్చ జరుగుతుంది. రాజకీయం, ఉపాధ్యాయ సంఘాల నేతల అండదండలతో ప్రైవేట్ పాఠశాలలో పెట్టుబడిదారులుగా మారి వారికి అనుకూలమైన పాఠశాలకు బదిలీ చేయించుకుని తమ వ్యా పార సామ్రాజ్యాన్ని కొనసాగిస్తున్నారని వి మర్శలు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ వ్యా పారం పూర్తిగా దెబ్బ తినడం చిట్టిల వ్యాపారంలో భారీగా నష్టాలు చవిచూడడం ఫలి తంగా ప్రైవేట్ పాఠశాలలో పెట్టుబడులు పె ట్టి డబ్బు సంపాదనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. జిల్లా వ్యా ప్తంగా ఇప్పటికే పదుల సంఖ్యలో పంతులు చిట్టీల వ్యాపారం పేరుతో అమాయకులను బురిడీ కొట్టి కోట్లకు కోట్లు అడగలేత్తిన ఘటనలు ఉన్నాయి.

మరి కొంతమంది చిట్టిల పేరుతో ప్రజలను మోసగించడంతో కటకటాల పాలైన ఘటనలు కూడా ఉన్నాయి. బతకలేక బడిపంతులు అనే నానుడి నుంచి నేడు కోటీశ్వరుల జాబితాలో తమ పేర్లు నమోదు కోసం తహతహలాడుతున్నట్లు వి మర్శలు వ్యక్తం అవుతున్నాయి. నాగర్ క ర్నూల్ జిల్లాలోని కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ వంటి పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రైవేటు పాఠశాలలను కనీస అనుమతులు లేకుండానే నెలకొల్పుతున్నారని ప్రచారం జరుగుతుంది.

అందు కు జిల్లా కేంద్రంలోని డీఈవో కార్యాలయంలో కొంతమంది అధికారులతో అంట కాగుతూ ప్రైవేటు పాఠశాలల ఉనికిని కాపాడుతున్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది. ఒక్కో ప్రైవేట్ పాఠశాలలో రిటైర్డ్ అయిన ఉ ద్యోగులు, సర్వీస్ లో ఉండే ఉద్యోగులు సై తం తెర వెనుక పర్సెంటేజీ చొప్పున భారీ గా పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పేద మధ్యతరగతి విద్యార్థుల ను బలవంతంగా వారికి సంబంధించిన ప్రైవే టు పాఠశాలలకు మళ్లించి అడ్డగోలుగా ఫీజు లు దండుకుంటున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభు త్వం చేపట్టిన బడిబాట కార్యక్రమంలోనూ ఆశించిన స్థాయిలో విద్యార్థుల చేరికలు జరగ లేదన్న వాదన వినపడుతోంది.

 అమలు కాని విద్యా హక్కు చట్టం..!

జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యాహ క్కు చట్టం అమల్లోకి రావడం లేదు. ప్రతి ఏటా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఫీ జుల నియంత్రణపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫా మ్స్, షూస్, టై, బెల్ట్ వంటి వాటి పేరుతో పాటు ఒక్కో తరగతికి వేళల్లో ఫీజులు వసూ ళ్లు చేస్తూ విద్యను వ్యాపారంగా మలుచుకున్న పరిస్థితి ఏర్పడింది.

కనీస వసతులు సౌకర్యాలు కల్పించక పోయినా కనీస అర్హత ఉపాధ్యాయులను ఏర్పాటు చేయకపోయి నా అడ్డగోలుగా డబ్బులు దండుకోవడం పరిపాటిగా మార్చుకున్నట్లు విమర్శలు ఉన్నాయి. దారిద్ర రేఖకు దిగువన ఉన్న పిల్లలకు 25% ఉచితంగా విద్యను అందించాల్సి ఉంది. కానీ ఇది ఎక్కడ ఆచరణలోకి రాకపోవ డం విశేషం.

దీంతోపాటు విద్యార్థులను ఆయా గ్రామీణ ప్రాంతాల నుంచి పాఠశాలకు తరలించేందుకు ఏర్పాటు చేసుకున్న స్కూల్ బస్సులు కూడా కనీస నిబంధనలను పాటించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయినా పర్యవేక్షణ చేయాల్సిన విద్యాశాఖ అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించడం వెనుక ప్రభుత్వ టీచర్ల ప్రమేయం దా గి ఉందని వాదన వినిపిస్తోంది.

నెలవారి భా రీ మొత్తంలో ముడుపులు అందుకోవడం వ ల్లే ప్రైవేటు పాఠశాల వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులు ప్రభుత్వ పాఠశాల పంతుళ్ల కదలికలపై నిఘా ఉంచి ప్రైవేటు పాఠశాలలకు వంత పాడుతున్న ప్రభుత్వ టీచర్లకు మొకుతాడు వేయాల్సిన ఆవశ్యకత ఉందని వాదనవినపడుతోంది.