విషాదంగా మారుతున్న ఈత సరదా
25-05-2024 12:05 AM
పాఠశాలలు, విద్యాసంస్థలకు వేసవి సెలవులు రావడంతో కొందరికి ఈత సరదా విషాదకరంగా మారుతున్నది. చిన్నారులు, యువత ఈతకు వెళ్లి మృత్యువాత పడుతున్న ఘటనలు ఈ మధ్య చాలా వెలుగు చూస్తున్నాయి. అవి ఎంతో కలచి వేసేలా విషాదాంతమవుతున్నాయి. స్నేహితులతో కలిసి వెళ్లి, మిత్రులు సవాలు చేయడంతోనో, ఇతరుల ప్రోత్బలంతోనో కుంటలు, చెరువుల్లోకి దిగి మరణిస్తున్నారు. తల్లిదండ్రులు, సంరక్షకులు, పెద్దల పర్యవేక్షణ లేకపోవడం ఇందుకు ముఖ్య కారణంగా కనిపిస్తున్నది. ఆయా తటాకాలవద్ద ప్రభుత్వాలు తగిన రక్షణ ఏర్పాట్లు చేయడం ఎంతో అవసరం.
-తలారి గణేష్, వెల్లంకి, యాదాద్రి జిల్లా






