ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి
ఐకెపి జిల్లా డిపిఎం సాయిలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని ఐకెపి కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను త్వరితగతిన నమోదు చేసి రైతుల ఖాతాలో త్వరగా డబ్బులు వచ్చే విధంగా కృషి చేయాలని ఐకెపి సిబ్బందికి ఐకెపి జిల్లా డిపిఎం సాయిలు సూచించారు.ఈ సందర్భంగా ఐకెపి జిల్లా డిపిఎం సాయిలు ట్యాబ్ ఎంట్రీ స్థితిగతులను తెలుసుకొన్నారు.శనివారం మండలంలోని వదల్ పర్తి, చీనూరు, ధర్మారెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని తూకం వేసిన బస్తాల అధికంగా ఉన్న సెంటర్లలో లారీలు అదనంగా సమకూర్చాలని సంబంధిత ట్రాన్స్పోర్ట్ అధికారులతో మాట్లాడటం జరిగింది.వర్షాకాలం సమీపిస్తున్నందున వరి ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు పూర్తిస్థాయిలో కప్పి ఉంచాలని ఆయన సిబ్బందికి పలు సూచనలు తెలియడం జరిగింది.ఆయన వెంట మండల ఎపిఎం రామ్ నారాయణ గౌడ్,సీసీలు దత్తు,రమేష్,రవి తదితరులు పాల్గొన్నారు.






