calender_icon.png 4 June, 2025 | 2:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోండి

02-06-2025 07:22:11 PM

తహసిల్దార్ దశరథ..

వలిగొండ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన భూభారతి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 3 నుండి 20 వరకు నిర్వహించే రెవిన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వలిగొండ తహసిల్దార్ దశరథ(Valigonda Tahsildar Dasharatha) అన్నారు. ఈనెల 3న తుర్కపల్లి, కాశమ్మకుంట, వర్కట్ పల్లి గ్రామాలలో, 4న నాగారం, చిత్తాపురం గ్రామాలలో, 5న గోకారం, ముద్దపురం గ్రామాలలో, 6న పులిగిల్ల, గోపరాజుపల్లి గ్రామాలలో, 9న వెలువర్తి, సంగెం గ్రామాలలో, 10న రెడ్ల రేపాక, లోతుకుంట గ్రామాలలో, 11న గురునాథపల్లి, ప్రొద్దుటూరులో గ్రామాలలో, 12న ప్రొద్దుటూరు, వెంకటాపురం గ్రామాలలో, 13న టేకులసోమరం, ఆరూరు గ్రామాలలో, 16న అరూర్, గంగాపురం, సుంకిశాల గ్రామాలలో, 17న వేములకొండ, పహిల్వాన్ పురం గ్రామాలలో, 18న దుప్పల్లి, వలిగొండ, మల్లేపల్లి గ్రామాలలో, 19న కంచనపల్లి, నరసాపురం గ్రామాలలో, 20న గోల్లేపల్లి  మొగిలిపాక గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.