calender_icon.png 1 June, 2025 | 1:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి

09-11-2024 03:18:15 PM

కరీంనగర్ (విజయక్రాంతి): ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ సూచించారు.  (స్వీప్) ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025 లో భాగంగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఈరోజు, రేపు నవంబర్ 10వ తేదీన ప్రత్యేక ఓటరు నమోదు నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 1వ తేదీ 2025 నాటికి 18 సంవత్సరాలు నిండే యువత, కొత్త ఓటర్ గా నమోదు చేసుకునేందుకు, మార్పులు సవరణకు, వెలువడిన ఓటరు జాబితాలో అభ్యంతరాల తెలిపేందుకు కోసం బూత్ లెవల్ ఆఫీసర్లు తమ బూత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటారన్నారు. నూతన ఓటరుగా నమోదుకు ఫామ్-6, అక్టోబర్ 29న విడుదల చేసిన ఓటర్ ముసాయిదాలో అభ్యంతరాల కోసం ఫారం-7, సవరణలకు ఫారం-8 దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.  ప్రజలు ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైటు ద్వారా కూడా దరఖాస్తూ చేసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.