28-06-2025 08:24:01 PM
సనత్ నగర్,(విజయక్రాంతి): వివిధ రకాల ఆరోగ్య పరమైన సమస్యలతో బాధపడుతున్న వారు ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని కార్యాలయంలో సనత్ నగర్ లోని ఎస్ఆర్టీకి చెందిన ప్రసాద్ గుప్తాకు రూ.1.10 లక్షలు, జెలాని బేగం కు రూ.1 లక్ష చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన ఆర్ధిక సహాయం పత్రాలు (LOC) లను అందజేశారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొలన్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు.