calender_icon.png 26 June, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడ్చల్ జిల్లాలో ట్యాపింగ్ కలకలం

26-06-2025 12:17:51 AM

  1. సిట్ ముందు హాజరైన ఎంపీ, డీసీసీ అధ్యక్షుడు 

మైనంపల్లి హనుమంతరావుకు పిలుపు 

జిల్లాకు చెందిన ఉన్నతాధికారి ఫోన్ ట్యాపింగ్?

ఇంకా ఎవరి వంతోనని ఉత్కంఠ 

మేడ్చల్, జూన్ 25(విజయ క్రాంతి): మే డ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం రేపుతోంది. జిల్లాకు చెందిన పలువురు నేతలకు దర్యాప్తు సంస్థ నుంచి పి లుపు రావడంతో ఖంగు తింటున్నారు. తమ ఫోన్ లో ట్యాపింగ్ అయి మాట్లాడిన మాట లు బయటకు రావడంతో విస్మయానికి గురవుతున్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాం లో విపక్ష పార్టీల నాయకుల ఫోన్లు ట్యాపిం గ్ అయ్యాయని, దీనిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

దీనిని సిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తోంది. ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలున్న అ ప్పటి పోలీస్ అధికారులను విచారించింది. సిట్ సేకరించిన ఫోన్ నెంబర్ల ఆధారంగా వారికి ఫోన్ చేసి వాంగ్మూలం నమోదు చే స్తున్నారు. సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హరి వర్ధ న్ రెడ్డిని, మంగళవారం ఎం పీ ఈటెల రాజేందర్ ను పిలి చి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు.

హరి వర్ధన్ రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తరఫున పనిచేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డితో కలిసి పనిచేయడం వల్ల తన ఫోన్ ట్యాప్ అయినట్లు హరి వర్ధన్ రెడ్డి భావిస్తున్నారు.

ఈటెల రాజేందర్ ఫోను 2018 నుంచే ట్యాప్ అయినట్టు తెలుస్తోంది. బీ ఆర్‌ఎస్ పార్టీలో ఉన్న సమయంలోనే ఆ పార్టీ నేతలు ఈటెల రాజేందర్ పై గట్టి నిఘా వేశారు. ఈటెల రాజేందర్ పా ర్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేసిన తర్వాత వచ్చిన ఉప ఎన్నికల్లో రాజేందర్ అనుచరుల ఫోన్లను కూడా టాప్ చేసినట్టు తెలుస్తోంది. 

మైనంపల్లి హనుమంతరావు కు పిలుపు 

కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు అనుచరులకు సైతం సీట్ నుం చి ఇటీవల పిలుపు వచ్చింది. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకుడు గుండా నిరంజన్, మల్కాజిగిరి కార్పొరేటర్ ప్రేమ కుమార్, కపిల్ ను సిట్ ఇటీవల పిలిచి వాంగ్మూలం నమోదు చేసుకుంది. మైనంపల్లి హనుమంతరావు మల్కా జిగిరి నుంచి బి ఆర్ ఎస్ తరపున ప్రాతిని ధ్యం వహించారు.

ఎన్నికల సమయంలో కుమారుడు రోహిత్ కు మెదక్ టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి గళం విప్పారు. అ నంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి, ఆ పార్టీ తరపున మల్కాజిగిరి నుంచి పోటీ చేశారు. ఈ సమయంలో మైనంపల్లి హనుమంతరావు ఫోన్ ట్యాపింగ్ తో ఎప్పటికప్పుడు కదలికల ను, వ్యూహాలను తెలుసుకున్నట్లు తెలుస్తోంది. హనుమంతరావు ను సిట్ పిలిచిన ట్లు తెలిసింది. ఆయన ఇంకా వాంగ్మూలం ఇవ్వలేదు. ఫోను ట్యాపింగ్ వల్లే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని ఆ పార్టీ నా యకులు అంటున్నారు. 

అధికారుల ఫోనులు సైతం....

విపక్ష పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లు, సొంత పార్టీ నాయకుల ఫోన్ లే కాకుండా అధికారుల ఫోన్లు కూడా టాపింగ్ చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఆ సమయం లో పనిచేసిన ఒక ఉన్నతాధికారి ఫోన్ ను ట్యాపింగ్ చేసినట్లు తెలిసింది. ఈ అధికారిని త్వరలో పిలిచి వాంగ్మూలం నమోదు చేసుకునే అవకాశం ఉంది.