14-02-2026 12:00:00 AM
నిందితుల అరెస్ట్, రిమాండ్కు తరలింపు: టేక్మాల్ ఎస్ఐ అరవింద్
మెదక్, ఫిబ్రవరి 13(విజయ క్రాంతి) : మెదక్ జిల్లా టేక్మాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన్నట్లు టేక్మాల్ ఎస్ఐ అరవింద్ వెల్లడించారు. వివరాల ప్రకారం తంప్లూర్ గ్రామానికి చెందిన శ్యామల అనే మహిళ పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా, గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు గొలుసును అపహరించి అక్కడి నుండి పరారయ్యారు. బాధితురాలు వెంటనే టేక్మాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సాంకేతిక ఆధారాలు, సమాచార సేకరణ ఆధారంగా నిందితులైన పాపయ్య, పోచయ్య గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి దొంగిలించిన మూడు తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చైన్ స్నాచింగ్ ఘటనలు అధికమవుతున్నాయని ఎస్ఐ అరవింద్ తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానా స్పద వ్యక్తులు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.