calender_icon.png 7 June, 2025 | 11:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి విరాళం

03-06-2025 12:15:19 AM

కొత్తకోట, జూన్ 2: కొత్తకోట పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ హరిహర పుత్ర ధర్మశాస్త్ర అయ్యప్ప క్షేత్రం ఆలయ నిర్మాణానికి  పొగాకు బద్రప్ప  జ్ఞాపకార్థం వారి మనుమడు అభిషేక్  జన్మదినం సందర్భంగా  కొత్తకోట పట్టణ ప్రముఖ బంగారు వ్యాపారి శ్రీ పరమేశ్వరి జ్యూవెల్లర్స్ యజమాని పొగాకు శిరీష రాఘవేంద్ర ప్రసాద్  దంపతులు అయిదు లక్షల ఒక వేయి  నూట పద హారు రూపాయలు విరాళాన్ని అందజేశారు.

అయ్యప్ప సేవాసమితి అధ్యక్షులు శ్రీ ధూపం నాగరాజు, పొగాకు అనీల్ కుమార్, విశ్వనాథం గంగాధర్, సత్యం సాగర్, వేముల సుధాకర్ రెడ్డి, వారణాసి సతీష్ కుమార్, దివాకర్ రావ్, బాలయ్య నాయుడు, భీమ కిషోర్‌లకు విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భగా అయ్యప్ప సేవాసమితి సభ్యులు పొగాకు అభిషేక్  ను శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు  తెలిపారు.