02-06-2025 12:30:52 PM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ(Telangana Formation Day) వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ మార్కెట్లో మార్కెట్ చైర్మన్ గంట సంజీవరెడ్డి, మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ ప్రసన్న రాణి, ఎంపీడీవో కార్యాలయంలో మండల ప్రత్యేకాధికారి డిఆర్డిఓ పిడి, మధుసూదన్ రాజ్, తాసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ వివేక్, పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ మురళీధర్ రాజ్, సొసైటీ కార్యాలయాల్లో చైర్మన్లు మర్రి రంగా రావు, దికొండ వెంకన్న, పీహెచ్సీలో డాక్టర్ నంబి కిషోర్, మహిళా సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షురాలు అమృత, వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏఈఓ రాజేందర్, జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీడీవో క్రాంతి, ఉప తహసిల్దార్ ఎర్రయ్య, ఏపీఎం రాజీరు, మార్కెట్ కార్యదర్శి అమరలింగేశ్వర్ రావు, సొసైటీ ల సీ ఈ ఓ లు మల్లారెడ్డి, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.