calender_icon.png 4 June, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత ఉద్యోగ ఉపాధి లక్ష్యంగా ముందుకు

02-06-2025 12:50:41 PM

రాష్ట్ర ఐ టి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

కరీంనగర్,(విజయక్రాంతి): ఈ రాష్ట్ర యువతే ప్రజా ప్రభుత్వ నిజమైన నిర్మాతలు. వారి భవిష్యత్తుకు గ్యారెంటీ ఇస్తూ, యువత ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచే స్తోందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర అవతరణ దినం(Telangana Formation Day) సందర్బంగా కరీంనగర్ పోలీస్ పరేడు మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీచేసింది. 3 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించి, ప్రయివేట్ రంగంలో లక్షఉద్యోగాలు సృష్టిస్తున్నామన్నారు. రాజీవ్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ చదివే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణను ట్రిలియన్ డాలర్ ఎకానమీ స్టేట్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ళ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. 58 పాఠశాలల నిర్మాణం చేపట్టాం. పాఠశాలల అభివృద్ధికి విద్యాకమీషన్ ఏర్పాటుచేశామన్నారు. రాష్ట్రంలో నిరుపేదలకు నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నామని రాష్ట్రంలో 4లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నామని రాష్ట్రంలో ఇప్పటికే గృహనిర్మాణాలు ప్రారంభించడం జరిగిందని వెల్లడించారు. నిర్మాణ దశలను బట్టి లబ్దిదారుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వేదికపై ఆవిష్కరించడంలో విజయం సాధించామన్నారు. అమెరికా, దక్షిణ కొరియా, సింగపూర్, దావోస్, జపాన్ దేశాలలో పర్యటించి బారీగా పెట్టుబడులు సాధించామన్నారు. హైదరాబాద్ వేదికగా పలు గ్లోబల్ ఈవెంట్లు నిర్వహించామని పేర్కొన్నారు. ఏఐ గ్లోబల్ సమ్మిట్, బయో ఏషియా సదస్సు, ప్రపంచ సుందరి పోటీలను విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. మహిళల ఆర్థిక సాధికారతకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని 7 వేల 626 స్వయం సహాయక సంఘాలకు 785.66 కోట్ల ఋణాలను మంజూరు చేశామని సూచించారు. 7 వేల 999 మంది మహిళలకు 66 కోట్ల 18 లక్షల రూపాయల స్త్రీనిధి ఋణాలను ఇచ్చామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.