03-06-2025 11:32:16 AM
హైదరాబాద్,(విజయక్రాంతి): నూతన రెవెన్యూ చట్టం భూభారతి అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి భూభారతి సదస్సులు నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై అవగాహన కోసం ఇవాళ్టి నుంచి జూన్ 20వ తేదీ వరకు అన్ని మండలాల్లో సదస్సులను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. 'ప్రజల వద్దకే రెవెన్యూ' నినాదంతో ఏడాదిలోప భూ ప్రక్షాళన పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం, ప్రతి కమతానికి సరిహద్దులతో కూడిన మ్యూప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు సర్వేయర్ల సంఖ్యను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కొనసాగుతోంది.