calender_icon.png 18 February, 2026 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ ఛైర్మన్‌ ఎన్నిక నిర్ణయం ఆర్‌వోదే

18-02-2026 01:09:26 PM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా(Rangareddy District) ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) బుధవారం విచారణ జరిగింది ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్ణయం ఆర్ వోదేనని హైకోర్టు తెలిపింది. ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై(Ibrahimpatnam Municipal Chairman Election) హైకోర్టు ఇచ్చిన స్టే తొలగించింది. మంచిరెడ్డి తరఫు న్యాయవాది మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక జరిగిందని తెలిపారు. ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని యాదగిరి తరఫు న్యాయవాది కోర్టుకు సూచించారు. ఎన్నికపై హెబియస్ కార్పస్ పిటిషన్ లో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

హైకోర్టులో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరి

బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆకుల యాదగిరిని(BRS Councilor Akula Yadagiri) పోలీసులు హైకోర్టులో హాజరుపర్చారు. మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కుమారుడు బలవంతంగా తీసుకెళ్లినట్లు యాదగిరి కోర్టుకు తెలిపారు. తనను బాపట్ల జిల్లా చీరాల తీసుకెళ్లి బౌన్సర్లను పెట్టి మానసికంగా, శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారని యాదగిరి వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) తరఫున మున్సిపల్ ఛైర్మన్ రేసులో ఉన్నానని యాదగిరి తెలిపారు. ఈ నెల 16న ఉదయం నుంచి రాత్రి వరకు కారులోనే తిప్పారని వివరించారు. తనకు బీపీ, షుగర్ ఉన్నా భోజనం కూడా ఇవ్వలేదని యాదగిరి(Yadagiri) ఆవేదన వ్యక్తం చేశారు. తాను లేకపోతే కోరమ్ ఉండదనే తనను తీసుకెళ్లినట్లు కోర్టుకు తెలిపారు. తాను కనిపించకపోవడంతో తన కుమారుడు పిటిషన్ వేశారని యాదగిరి చెప్పారు.