03-06-2025 12:42:59 AM
మహబూబ్ నగర్ జూన్2 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ప్ర గతి సాధిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ సంద ర్భంగా పురస్కరించుకొని రోడ్ల భవనాల శాఖ అతిథిగా దగ్గర ఉన్న అమరవీరుల స్థూ పానికి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టరేట్ లో జాతీయ జెండాను రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక,సాంస్కృతిక, పురావస్తు శాఖ మం త్రి జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల కు టుంబ సభ్యులకు పూలమాల శాలువతో ఘనంగా సన్మానించారు. 130 మహిళా సం ఘాలకు బ్యాంక్ లీకేజి కింద రూ 10 కోట్ల రుణ మంజూరు చెక్కును,స్త్రీ నిధి ద్వారా 212 మంది మహిళా సంఘాల సభ్యులైన ల బ్దిదారులకు రూ 5 కోట్ల రుణం మంజూరు చెక్కులను లబ్ధిదారులకు మంత్రి జూపల్లి అందజేశారు.
రైతు నేస్తం కార్యక్రమం కింద 10 మంది అభ్యుదయ రైతులకు విత్తనాలు పంపిణీ కార్యక్రమం ను రాష్ట్ర అవతరణ ది నోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రారంభించారు. 14 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలు అంద చేశారు.అదే వి ధంగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరై పునాది వరకు నిర్మాణం చేసుకున్న 4 గురు లబ్దిదారులకు ఒక్కొకరికి లక్ష రూ. లక్ష విలువ గల చెక్కులను మంత్రి మంజూరు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చక్కదిద్దుకుంటూ ఎ ప్పుడు ఎవరికీ ఏది అవసరమో అది అంది స్తూ అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. వా స్తవాలను ప్రజల ముంగిట ఉంచుతూ పారదర్శకంగా ప్రజాపాలన అందిస్తున్నామని స్పష్టం చేశారు.
అంతకుముందు పలువురు విద్యార్థులు ప్రత్యేక గీతలకు నృత్యాలను చేశా రు. కలెక్టరేట్లో వివిధ శాఖల ద్వారా ఏ ర్పాటు చేసిన స్టాల్స్ ప్రత్యేకంగా మంత్రి సం దర్శించడంతోపాటు పలువురు ప్రజలు హాస్టల్స్ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వేడుకలలో శాసన సభ్యులు యెన్నం శ్రీనివాసరెడ్డి,జి.మధు సూధన్రెడ్డి,అనిరుధ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పి.డి. జానకి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జి ల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సిం హరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అని తా రెడ్డి , గృహ నిర్మాణ పిడి వైద్యం భాస్కర్ లు పాల్గొన్నారు.
అభివృద్ధి పథంలో గద్వాల జిల్లా పయనం: ఎపీ జితేందర్రెడ్డి
గద్వాల, జూన్ 02 (విజయక్రాంతి): గద్వాల జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో పయనిస్తుందని అదేవిదంగా తెలం గాణను భారతదేశంలోను, ప్రపంచస్థాయిలోను అగ్రస్థానంలో నిలిపేందుకు సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ెే2047 విజన్తో ముం దుకు సాగుతోందని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రభుత్వ సలహాదారు (క్రీడా వ్యవహారాలు) ఎపీ జితేందర్రెడ్డి అన్నారు.
జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవా రం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్, జిల్లా ఎస్పి శ్రీనివాసరావు, గద్వాల్ శాసన సభ్యులు బండ్ల కృ ష్ణ మోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడు, అదనపు కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, ఆర్డిఓ అలివేలు, గద్వాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నల్ల హనుమంతు, అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడప్ప, వివిధ శాఖల అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.
ప్రజల అభీష్టాన్ని గుర్తించి రాష్ట్రాన్ని ఇచ్చింది తెలంగాణ తల్లి సోనియమ్మ: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి, జూన్ 2 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉవ్వెత్తుఎగీసిన ఉద్యమంలో అమరులగా నిలిచిన అమ రవీరులను, తెలంగాణ ఉద్యమకారుల కు టుంబాలకు తీవ్ర అన్యాయం చేసింది బి ఆ ర్ ఎస్ దయ్యాల పార్టీ నేనని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సోమవారం వనపర్తి పట్టణంలోని వివేకానంద చౌరస్తాలో నిర్మించ తలపెట్టిన తెలం గాణ అమరవీరుల స్తూపం శంకుస్థాపన కా ర్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.
గత 60 సంవత్సరాలుగా తొలి, మలిదశ ఉద్యమాలలో పాల్గొని ఎంతోమంది తెలంగాణ వాదులు, విద్యార్థులు అమరులయ్యా రని , రాష్ట్ర సాధనకై అమరులైన కుటుంబాలను ఉద్యమకారులను నమ్మించి వంచిం చింది బి ఆర్ ఎస్ దయ్యాల పార్టీ నేనన్నా రు. పార్టీలకతీతంగా తెలంగాణ రాష్ట్ర మొత్తం ఏకమై ఉవ్వెత్తు నిరసనలు చేపడితే సు ష్మా స్వరాజు తో పాటు ఎంతోమంది పార్లమెంట్లో నిరంతరాయంగా గళం వినిపించిన విషయాన్ని ఆయన గుర్తుకు చేశారు.
ఎట్టకేలకు తెలంగాణ తల్లి సోనియాగాంధీ సాహసోపేతమైన నిర్ణయంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ నిర్ణయంతోనే రాష్ట్రం సిద్ధించిందని ఢిల్లీ వెళ్లి కాళ్లు మొక్కిన కల్వకుంట్ల కుటుంబం స్వార్థపూరిత రాజకీయ పాలనతో తెలంగాణ రాష్ట్రానికి ప్రజలకు అమరులకు తీరని నష్టం చేసిందని ఆయన విమర్శించారు.
తెలంగాణ వాదం ఎంతో బలంగా వినిపించిన 2014 ఎన్నికలలో ఓటమిపాలైన కొందరు నాయకులు మాలాంటి ఎందరో నాయకుల కష్టంపై 2018 ఎన్నికలలో విజయం సాధించి అమరులను, మాలాంటి వారిని మరిచిపోయి ఇష్టానుసారంగా వ్యవహరించి వనపర్తిని ధ్వంసం చేశారన్నారు. పదేళ్ల పాలనలో తె లంగాణ ఉద్యమకారుల స్థూపం నిర్మించేందుకు స్థలం దొరకలేదా అని ఆయన సూటి గా ప్రశ్నించారు.
గజ్జ కట్టి గలమెత్తి గర్జించిన గద్దర్ లాంటి విప్లవ నాయకులను సైతం అవమానపరిచిన వారికి నేడు తగిన శాస్తి జరిగిందని దూషించారన్నారు. బి ఆర్ ఎస్ పాలనలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న గద్దర్ కుటుంబంలో నుంచి ఆయన కుమా ర్తె వెన్నెలను తెలంగాణ సాంస్కృతిక సారధి రాష్ట్ర అధ్యక్షురాలుగా నియమించి గౌరవించుకున్నది తెలంగాణ సర్కార్ అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వనపర్తి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చం దర్, వనపర్తి నియోజకవర్గ సమన్వయ కర్త లక్కాకుల సతీష్, మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్లు బి కృష్ణ, పాకనాటి కృష్ణయ్య, జిల్లా దిశ కమిటీ సభ్యురాలు ధనలక్ష్మి, ఉద్యమకారులు యోగానంద రెడ్డి, విష్ణువర్ధన్ గౌడ్, మహమ్మద్ లతీఫ్, రాజశేఖర్ రెడ్డి, మన్సూ ర్ ఆలీ, చీర్ల సత్యం సాగర్, ఎండి కాజా, కూ రగాయల రవి, ఏఆర్ గౌడ్, దేవన్న నాయుడుతో పాటు పలువురు ఉద్యమ కారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ: రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి
నాగర్కర్నూల్, జూన్ 2 (విజయక్రాంతి): ప్రత్యేక రాష్ట్రం సాధించడం కోసం ఎంతోమంది పోరాడి, అమరులు ఆత్మ బలిదానా లు చేసుకున్నారని వారి త్యాగాలను గుర్తించి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రా న్ని ప్రకటించినట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షులుజీ చిన్నారెడ్డి అన్నారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా నాగర్కర్నూల్ జిల్లాలోని పోలీస్ పెరేడ్ మైదానంలో వేడుకలు ఘనం గా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్తో కలిసి అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగరవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
అనంతరం అమరులకు టుంబాలను సన్మానించి, రైతులకు విత్తనాలను అందజేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకోగా, వారిని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డితో కలిసి బహుమతులతో సత్కరించారు. అధికారులు ప్రభుత్వ పథకాల స్టాళ్లను సందర్శించారు.
తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తుంది: షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం
వనపర్తి, జూన్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షే మంతో పాటు సామాజిక న్యాయంలో సై తం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చే స్తుందని రాష్ట్ర షెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం అన్నారు. సోమవారం జిల్లా ఐడిఓసి ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర షెడ్యూల్ కులాల స హకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రీతం హాజరయ్యారు.
ముఖ్యఅతిథితోపాటు వేదికపై జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, వనపర్తి మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ హా జరయ్యారు. ముఖ్యఅతిథి ముందుగా కలెక్టర్, శాసనసభ్యులతో కలిసి తెలంగాణ అమ రవీరుల స్థూపానికి పుష్పగుచ్చంతో నివాళి అర్పించారు. అనంతరం పోలీసు బలగాల గౌరవ వందనం స్వీకరించారు.
జిల్లా యం త్రాంగం తరుపున ముఖ్య అతిథికి ఘన స్వా గతం పలికారు. అనంతరం జాతీయ పతాకా న్ని ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం జయ జయ హే తెలంగాణ గీతాలాపన చేశారు. అనంతరం ఆయ న మాట్లాడుతూ జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు.
రాష్ట్రంలోని పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమంతో పా టు సామాజిక న్యాయంలో సైతం తెలంగాణ దేశానికి దిశా నిర్దేశం చేస్తుందని తెలిపారు. రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్ళు నిండాయని తెలిపారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులకు, తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం పోరాడిన వారి కుటుంబ సభ్యులను సత్కరించి గౌరవించారు.
ఈ సందర్భంగా వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులు చేసిన సాంస్కృతిక నృ త్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఐడిఓసి ఆవరణలో పోలీస్ శాఖ, ఎస్సీ కార్పొరేషన్, జిల్లా సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, జిల్లా వైద్యశాఖ, జిల్లా వ్యవసాయ శాఖ, పురపాలక, గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాళ్లను ముఖ్య అతిథితో పాటు, కలెక్టర్, ఎ మ్మెల్యే సందర్శించి తిలకించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్ర జా ప్రతినిధులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.