21 August, 2026 | 10:26 PM

Breaking News

గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు   •   ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ప్రవీణ్‌కు ఆర్థిక సాయం   •   ఘనంగా ప్రారంభమైన ఓయాసిస్ కాన్- 2026   •   కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా నిమ్మనగోటి శ్రీకాంత్   •   తీవ్ర రూపం దాల్చిన ఆదివాసీల నిరసన దీక్ష   •   పిల్లల ప్రవర్తనను.. తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనించాలి   •   మద్యం తాగి వాహ‌నం న‌డిపిన వ్య‌క్తి రిమాండ్   •   కొత్తగూడెంల జీజీహెచ్ త్వరలో క్యాథ్ ల్యాబ్ సేవలు: ఎమ్మెల్యే కూనంనేని   •   కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు పాటుపడడం అభినందనీయం   •   ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లాలి   •  

శాసనసభ రేపటికి వాయిదా

31-07-2024 04:35 PM

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ద్రవ్యవినిమయ బిల్లుకు బుధవారం శాసనసభ ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనసభలో బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన, నిరసనల మధ్య ద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం లభించింది. సీపీఐ వాయిదా ప్రతిపాదనను సభాపతి తిరస్కరించారు. దీంతో సభాపతి శాసనసభను రేపటికి వాయిదా వేశారు. సభలో మాట్లాడేందుకు మైక్‌ ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ నిరసనకు దిగారు. స్పీకర్‌ పోడియం ముందు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఆందోళన చేపట్టారు. సభా సంప్రదాయాలు బీఆర్‌ఎస్‌ పాటించడం లేదు డిప్యూటీ సీఎం భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.