దోమకొండకు నిధులు మంజూరు
16-03-2026 08:15 PM
కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క సహకారంతో దోమకొండ గ్రామానికి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 75 లక్షల రూపాయలు మంజూరైనట్లు సర్పంచ్ ఐరెని నరసయ్య సోమవారం తెలిపారు. కాలేజీ వెళ్లే రోడ్డు 10 లక్షలు, పోలీస్ స్టేషన్ వెళ్లే రోడ్డు 15 లక్షలు, రైతు వేదిక రోడ్డు 20 లక్షలు, గుండ్ల చెరువు సమీపంలోని గురుకుల పాఠశాల రోడ్డుకి 30 లక్షలు మంజూరు అయినట్లు వివరించారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ, సీతక్కలకు కృతజ్ఞతలు తెలిపారు.




