9 April, 2026 | 7:30 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

తెలంగాణ‌లో ఒంటి గంట వ‌ర‌కు 40 శాతం పోలింగ్

13-05-2024 02:17 PM

హైద‌రాబాద్ : తెలంగాణలోని 17 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎన్నిక‌ల పోలింగ్ ప్ర‌శాంతంగా కొనసాగుతోంది.మ‌ధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 40.13 శాతం పోలింగ్ న‌మోదు అయినట్లు రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ప్రకటించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో 36 శాతం పోలింగ్ న‌మోదైన‌ట్లు అధికారులు తెలిపారు. ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు కోటిన్న‌ర మంది ఓటేశారు. 17 లోక్ సభ స్థానల్లో ఆదిలాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో మధ్యాహ్నం ఒంటి గంట వ‌ర‌కు 50.18 శాతం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 45.84 శాతం, నాగ‌ర్‌క‌ర్నూల్ ప‌రిధిలో 45.88 శాతం, న‌ల్ల‌గొండ‌లో 48.48 శాతం, జ‌హీరాబాద్ ప‌రిధిలో 50.71 శాతం, భువ‌న‌గిరిలో 46.49, చేవెళ్ల‌లో 34.56 శాతం, హైద‌రాబాద్‌లో 19.37 శాతం, క‌రీంన‌గ‌ర్‌లో 45.11 శాతం, ఖ‌మ్మంలో 50.63 శాతం, మ‌హ‌బూబాబాద్‌లో 48.51, మెద‌క్‌లో 46.72 శాతం, మ‌ల్కాజ్‌గిరి ప‌రిధిలో 27.69 శాతం, నిజామాబాద్‌లో 45.67 శాతం, పెద్ద‌ప‌ల్లిలో 44.87 శాతం, సికింద్రాబాద్‌లో 24.91, వ‌రంగ‌ల్ ప‌రిధిలో 41.62 శాతం పోలింగ్ న‌మోదైంది. ఇప్పటి వరకు ఇంకా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు భారులు తీరారు. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కోనసాగనుంది.