9 April, 2026 | 5:33 PM

Breaking News

108 అంబులెన్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన ఆడిట్ సూపర్‌వైజర్‌   •   కాంగ్రెస్ గ్యారంటీల అమలు ఎక్కడ?   •   మంగ్యాతండా పాఠశాలలో సరస్వతి విగ్రహం ఆవిష్కరణ   •   అల్లు అర్జున్ బర్త్‌డేకు ఆరోగ్య కానుక   •   ప్రవేట్ పాఠశాలలో దారుణం   •   ఢిల్లీకి నితీష్ కుమార్— బీహార్ కొత్త ముఖ్యమంత్రి సమ్రాట్‌ అంటూ పోస్టర్లు   •   దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •  

టిఫిన్ సెంటర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: ముగ్గురు మృతి

13-05-2024 03:26 PM

రఘునాథపల్లి: జనగామ జిల్లా రఘునాథపల్లిలో సోమవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు మొబైల్ టిఫిన్ సెంటర్‌ను ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రఘునాథపల్లిలో నేషనల్ హైవేపై హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో అతివేగంతో వచ్చిన అదుపుతప్పిన ఆర్టీసీ గరుడ బస్సు మొబైల్ టిఫిన్ సెంటర్‌ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అక్కడే టిఫిన్‌ చేస్తున్న ముగ్గురు వ్యక్తులు స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. క్షగతాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పతికి తరలించారు. గాయపడిన కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.