20-06-2025 01:20:09 AM
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): తెలంగాణ సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతంగా ఉందని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మాజీ ప్రధానమంత్రి టోనీబ్లెయిర్ ప్రశంసించారు. భారత్ పర్యటనలో ఉన్న టోనీబ్లెయిర్తో ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి గురువా రం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు వంటి విభిన్నవర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం రేవంత్రెడ్డి టోనీబ్లెయిర్కు తెలియజేశారు. తెలంగాణ రైజింగ్ ముఖ్య అంశాలను తెలియజేస్తూ, ఈ విజన్ను 2025, డిసెంబర్ 9న రాష్ర్ట ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు వెల్లడించనున్న ట్లు సీఎం తెలిపారు.
సుస్థిరాభివృద్ధి దిశగా సీఎం రేవంత్రెడ్డి ప్రణాళిక ఉందని టోనీ బ్లెయి ర్ ప్రశంసించారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’, ‘యం గ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ’, ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ వంటి ప్రాజెక్టులపై టోనీబ్లెయిర్ ఆసక్తి చూపారు.
ఇరునేత లు గంటకుపైగా సమావేశమైన అనంతరం తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, అమలులో భాగస్వామ్యానికి తెలంగాణ ప్రభుత్వం, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్(టీబీఐజీసీ) ప్రతినిధులు లెటర్ ఆఫ్ ఇంటెంట్ పత్రాన్ని పరస్పరం మార్చుకున్నారు. సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఎంపీలు మల్లు రవి, రఘువీర్రెడ్డి, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి జితేందర్రెడ్డి పాల్గొన్నారు.
1997 మధ్య పదేళ్ల పాటు యూకేకు ప్రధానమంత్రిగా, సుదీర్ఘకాలం ఇంగ్లాడ్ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించిన టోనీ బ్లెయిర్ రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత వివిధ దేశాల్లోని నాయకులకు విజన్, వ్యూహరచన వాటి అమలుకు సహకరించాలనే ఉద్దేశంతో టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ ఛేంజ్ను స్థాపించారు.