calender_icon.png 18 June, 2025 | 10:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

9వ రోజుకు చేరిన తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె

27-04-2025 08:37:32 PM

కామారెడ్డి టౌన్ (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణం కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిరవధిక సమ్మె ఆదివారం నాటికి 9వ రోజుకు చేరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Congress leader Rahul Gandhi)ని ఆదర్శంగా తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్టు అధ్యాపకులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ నాయకులు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా మాట్లాడుతూ... నిన్న హైదరాబాదులోని హైటెక్స్ లో జరిగిన కాంగ్రెస్ భారత్ సమ్మిట్ లో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ జాతీయ నాయకులు, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలందరికీ సమన్యాయం, సమానత్వం కలిగిన సమాజం కోసం పనిచేస్తాం అని పేర్కొన్నారని, అందుకు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి , రాహుల్ గాంధీ  సూచనలు పాటిస్తూ మావైపు దృష్టిసారించి మాకు కూడా సుప్రీంకోర్టు తీర్పు సమానపనికి-సమాన వేతనం ప్రకారము  రెగ్యులరైజేషన్ చేయాలని కోరారు. ఒకవేళ కొంత సమయం పట్టే పక్షంలో యూజీసీ పే స్కేల్ (బేసిక్+డి ఎ+హెచ్ ఆర్ ఏ+ 3% వార్షిక పెంపుతో కూడిన ఉద్యోగ భద్రత) అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల సమయంలో తమకు న్యాయం చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యను రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ ద్వారా చర్చలు జరిపి విశ్వవిద్యాలయాల అభివృద్ధికి, తాము చాలా సంవత్సరాలుగా విశ్వవిద్యాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని తమ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ సునీత, డా.నరసయ్య డా. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.