వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
11-05-2026 05:38 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న అన్నారు. సోమవారం మామడా మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో వేసవి శిబిరాన్ని విద్యా వారోత్సవాలను ప్రారంభించారు. ఈనెల 16 వరకు విద్యా వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.






