రూ.50 కోట్లతో ఆలయ అభివృద్ధి
కురవి ఆలయ కమిటీ బాధ్యతల స్వీకరణ
మహబూబాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో ప్రసి ద్ధిగాంచిన కురవి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని 50 కోట్ల రూ పాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ఆల య చైర్మన్ కొర్ను రవీందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆలయంలో 14 మంది సభ్యుల తో పాలకమండలి ప్రమాణ స్వీకారం చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మె ల్యే రామచంద్రునాయక్ సహకారంతో సూ మారు రూ.50 కోట్ల నిధులతో ఆలాయాన్ని సర్వాంగ అభివృద్ధి చేయనున్నట్లు తెలిపా రు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు బాలగాని శ్రీనివాస్ గౌడ్, కుదురుపాక ఉప్పలయ్య, బందెల సంజీవరెడ్డి, దొంగల జనార్దన్ రెడ్డి, రజిత, గడీల బిక్షపతి, చిన్నం గణేష్, ప్రొద్దుటూరి సత్యనారాయణ, భూక్య సక్రు, గు గులోతు సోమ్ల, వెంపటి శ్రీను, తీగుళ్ళ వేంకటేష్ గౌడ్, కాసుల మల్లికార్జున్ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వీరభద్రం, జిల్లా కార్యదర్శి బండి శ్రీను, నూకల వేణుగోపాల్ రెడ్డి, బాదావత్ రామునాయక్, వద్దుల సురేందర్ రెడ్డి, రజనీకాంత్, దైద భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.






