19 March, 2026 | 1:18 PM

Breaking News

ఖతార్‌పై దాడి చేస్తే.. ఇరాన్‌లోని గ్యాస్‌ఫీల్డ్ మొత్తాన్ని పేల్చేస్తాం   •   మైదాన ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఎత్తైన ప్రాంతాల్లో మంచు   •   ఢిల్లీలోని వాణిజ్య, పన్నుల భవనంలో అగ్నిప్రమాదం   •   ఇలా అయితే పండుగ ఎలా..?   •   దేశంలో ఉండాలంటే.. వందేమాతరం ఆలపించాల్సిందే.. ఒవైసీ కళాశాలల్లో ఉగ్రమూలాలు   •   బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చిన సర్పంచులు   •   కరాచీలో వర్షం బీభత్సం: 19 మంది మృతి.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్   •   తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు   •   ‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో కవిత కొత్త పార్టీ   •   శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం   •  

భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు

19-03-2026 10:51 AM

హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ఆలయాలు గురువారం భక్తులతో కిటకిటలాడాయి. కొత్త వస్త్రాలు ధరించి, భక్తులు తమ నివాసాలకు సమీపంలోని ఆలయాలకు పోటెత్తి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అత్యధికంగా జంట నగరాల్లోని శ్రీ గణేశ ఆలయాలను సందర్శించి రాబోయే సంవత్సరం సుసంపన్నంగా, వైభవంగా సాగాలని పూజలు చేశారు.

సుభాష్ బజార్‌లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం, జూబ్లీ హిల్స్‌లోని శ్రీ పెద్దమ్మ ఆలయం, బల్కంపేటలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయం, లిబర్టీ, జూబ్లీ హిల్స్‌లలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలే కాకుండా సికింద్రాబాద్‌లోని జేబీఆస్ మెట్రో స్టేషన్ వద్ద శ్రీ సిద్ధి వినాయక గణేష్ ఆలయం, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో గణేష్ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, భక్తులు తమ నివాసాలలో ‘పూరణ్ పోలి’ అని కూడా పిలువబడే ‘బొబ్బట్లు’ను, అలాగే బెల్లం, చింతపండు, వేప చిగుళ్లు, పచ్చి మామిడికాయలతో ‘ఉగాది పచ్చడి’ని తయారుచేశారు. నగరంలోని ఆలయాలే కాకుండా తెలుగురాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.