calender_icon.png 1 June, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల్లో భయానక వాతావరణం

13-11-2024 01:22:17 AM

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్, నవంబర్ 12 (విజయ క్రాంతి) : ప్రజాపాలన పేరిట గ్రామాల్లో పోలీసు నిర్బంధంతో ప్రభుత్వం భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం  మీడియాతో మాట్లాడారు. నమ్మి ఓట్లేసిన ప్రజల నోట్లో కాంగ్రెస్ మట్టికొడుతున్నదని విమర్శించారు.

వికారాబాద్ జిల్లా లగచర్లలో ఫార్మా కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కునేం దుకు చేస్తున్న ప్రభుత్వ ప్రయత్నంలో ప్రజాగ్రహానికి అధికారులు బలయ్యారని తెలిపారు. ‘కొడంగల్‌లో జరిగింది అధికారులపై దాడి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు కట్టలు తెంచుకున్న ఆగ్రహమే’ అని పేర్కొన్నారు. తనపై దాడి జరగలేదని కలెక్టర్ బహిరంగంగా ప్రకటించినా.. గ్రామాల్లో నిర్బంధం పెట్టి 50 మందిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ధ్వజమెత్తారు.