05-06-2025 12:20:54 AM
హైదరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)-2025 షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈనెల 18 నుంచి 30వ తేదీ వరకు ఈపరీక్షలు జరగనున్నాయి. నోటిఫికేషన్లో జూన్ 15 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొన్నప్పటికీ 18వ తేదీ నుంచి నిర్వహిస్తుండటం గమనార్హం. ఈమేరకు తాజాగా పరీక్షల నిర్వహణ తేదీలు, సబ్జెక్టులు, సెష న్లు, జిల్లాల వివరాలతో పాఠశాల విద్యాశాఖ పూర్తి షెడ్యూల్ విడుదల చేసింది.
మొదటి సెషన్ ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వర కు, సెషన్ 2 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు నిర్వహించనున్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు టెట్ దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిం దే. మొత్తం 9 రోజులు 16 సెషన్లలో పరీక్షలు జరగనున్నాయి. జూన్ 9 నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునేలా వీలుకల్పించే అవకాశ ముంది.
రాష్ట్రంలో ఏడాది రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే గతేడా ది డిసెంబర్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం, ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు రెండోసారి నిర్వహిస్తోంది. ఈసారి 1,83,653 దరఖాస్తులు వచ్చాయి.