19-06-2025 12:00:00 AM
రామగిరి, జూన్ 18(విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న టెట్ పరీక్షలు బుధవారం మంథని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాం తంగా ప్రారంభమయ్యాయి.. మొదటి రోజు ఉదయం జరిగిన పరీక్షలో 48 మందికి గా నూ కేవలం 12 మంది మాత్రమే హాజరయ్యారు.
సాయంత్రం జరిగిన పరీక్షకు 100 మంది అభ్యర్థులకు 86 మంది హాజరు కా గా, 14 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ బీ.వి ష్ణువర్ధన్ తెలిపారు. జూన్ 30వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణను పరిశీలకులు పర్యవేక్షించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బం దోబస్తు నిర్వహించారు.