19-06-2025 12:33:58 AM
తొలిరోజు 7,243 మంది గైర్హాజరు
హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష)-2025 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యా యి. ఈనెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. తొలి రోజు రెండు సెషన్లలో మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ పేపర్ 2 పరీక్ష జరిగింది. తొలిరోజు జరిగిన పరీక్షలో ప్రశ్నల సరళి సాధారణంగానే ఉన్నట్లు పలువురు అభ్యర్థులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తెలుగు సబ్జెక్టు కాస్త తేలికగా ఉందని, సందులు, ఛందస్సు, ఆలయాలు, నది తీరాలు, కవి పరిచయాలు అడిగారని, సైకాలజీలో వివిధ పద్ధ తులు, వివిధ అంశాల్లో బేసిక్ అంశాలు అడిగారని తెలిపారు. ఇంగ్లీష్ గ్రామర్పై గతంలో లాగే క ఠినంగా ప్రశ్నలు అడిగారని, గణితం, సైన్స్ కాస్త తేలిక, కాస్త కఠినంగా ఉన్నాయన్నా రు.
మొత్తానికి తొలిరోజు పరీక్షలో 75 నుంచి 85 మార్కులు ఎక్కువ మందికి వచ్చే అవకాశముందని, ఇంగ్లీష్, మ్యాథ్స్లో స్కోర్ చేసిన వారికి 100పైనే మార్కులు వచ్చే అవకాశముందని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.
7,243 మంది డుమ్మా...
ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగిన తొలిసెషన్కు 53 పరీక్షా కేంద్రాల్లో 13,131 మంది అభ్యర్థులకుగానూ 9513 (72.45 శాతం) మంది పరీక్షకు హాజరైతే 3618 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రెండో సెషన్లో 54 కేంద్రాల్లో 13,230 మందికిగానూ 9605 (72.6 శాతం) మంది పరీక్ష రాస్తే, 3625 మం ది డుమ్మా కొట్టారు. మొత్తంగా పరీక్షకు తొలి రోజు 7,243 మంది డుమ్మా కొట్టారు.