25-06-2025 07:11:15 PM
బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు ముస్తఫా..
మందమర్రి (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు ఎండి ముస్తఫా(BRS Student Wing State Leaders MD Mustafa) డిమాండ్ చేశారు. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో చేపట్టిన బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలను ఆయన సందర్శించి విద్యార్థి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ విద్యాసంస్థలు జూన్ 12న తరగతులు ప్రారంభం అయినప్పటికీ పాఠ్య పుస్తకాలు ఇవ్వడంలో జాప్యం చేయడం ప్రభుత్వ నిర్లక్షానికి నిదర్శనం అని ఆయన విమర్శించారు.
మధ్యాహ్న భోజనంలో శుభ్రత పాటించకపోవడం, ఇప్పటికి ప్రభుత్వ బడుల్లో టాయిలెట్స్ లేకపోవడం శోచనీయం అని ఆయన మండిపడ్డారు. విద్య సంస్థలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా, ఉపాధ్యాయులు లేకపోవడం ప్రభుత్వ నిర్లక్షవైఖరికి నిదర్శనమని ఆయన తీవ్రంగా విరుచుకుపడ్డారు. సరైన ఆట స్థలం విశాలమైన తరగతి గదులు ఉండవలసిన అవసరం ఉన్న 70% పాఠశాలలో ఆట స్థలాలు లేకపోవడం బాధాకరమని వెంటనే ఆయా పాఠశాలల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రవేట్ విద్యాసంస్థల ముసుగులో మాఫియా నడుస్తుందని పేద, మధ్య తరగతి విద్యార్దులే లక్ష్యంగా అధిక ఫీజులు వసూల్ చేస్తూ ఆర్ధిక లూటీ చేస్తున్నారనీ, బుక్స్, యూనిఫామ్ కచ్చితంగా తమ దగ్గరే తీసుకోవాలని ఒత్తిడి తెచ్చి ఫీజులకి సంబంధం లేకుండా 15000 నుండి 20000 వేల వరకు అధిక భారం మోపుతున్నారు.
ఎలాంటి అర్హత లేని ఉపాధ్యాయులతో విద్యాబోధన చేయడమే కాకుండా, ఫిట్నెస్ లేని బస్సులు నడుపుతున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్వి, బిఆర్ఎస్వై సోషల్ మీడియా నాయకులు ముస్తఫా, బట్టు రాజ్ కుమార్, తోట సురేందర్, సిపెల్లి సాగర్, మాసు వెంకటేష్, ముల్కల రమేష్, శనిగారపు అరుణ్, బోరిగం ముకేష్, సన్నీ, అబి, వంశీ, చారి, పాల్గొన్నారు.