calender_icon.png 29 June, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూలై 1న బీజేపీ రాష్ట్ర చీఫ్ ఎన్నిక

29-06-2025 02:07:45 AM

నేడు నోటిఫికేషన్ జారీ

హైదరాబాద్, జూన్ 28 (విజయక్రాంతి): బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. రాష్ర్ట అధ్యక్షుడి నియామ కంపై ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జూలై ఒకటిన రాష్ర్ట అధ్యక్షుడిని ప్రకటించనున్నారు. రెండు తెలుగు రాష్ట్రా లకు ఒకే రోజు బీజేపీ అధిష్ఠానం అధ్యక్షులను ప్రకటించనుంది. ఈ మేరకు బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడి ఎన్నికకు ఆదివారం నోటిఫికేషన్ వెలువడనుంది. బీజేపీ రాష్ర్ట ఎన్నికల ఇంచార్జి శోభాకరండ్లాజే సోమవారం రాష్ట్రానికి రానున్నారు. అధిష్ఠానం సూచించిన నేత వద్ద మాత్రమే ఆమె నామినేషన్ స్వీకరించనున్నారు.

జూలై ఒకటిన రాష్ర్ట అధ్యక్షుడిని ఆమె ప్రకటించనున్నారు. బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్న బీజేపీ.. రాష్ర్ట అధ్యక్షుడిగా బీసీ నాయకుడిని ప్రకటించాలని భావిస్తున్నట్టు సమాచారం. అందరికీ ఆమోదయోగ్యుడైన లక్ష్మణ్ వైపు అధిష్ఠానం మొగ్గుచూపినా.. ఆయన సుముఖత వ్యక్తం చేయనట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ర్ట అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

బీసీకి ఇస్తారా.. లేక మరో సామాజిక వర్గానికి ఇస్తారా అనేది కూడా రెండు రోజుల్లో తేలనుంది. అయితే గత ఏడాది జూన్ 10న కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన మరుసటి రోజు కిషన్‌రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడు తూ.. తనకు జోడు పదవులు భారమవుతాయని, రాష్ర్ట అధ్యక్ష పదవిని నిర్వహించలేనని ప్రకటించిన సంగతి తెలిసిందే. కీలకమైన మంత్రి పదవి కావడం తో వాస్తవంగా కిషన్‌రెడ్డి బీజేపీ రాష్ర్ట వ్యవహారాల్లో క్రియాశీలకంగా పనిచేయలేకపోయారు.