calender_icon.png 3 June, 2025 | 10:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుద్ధవనం సందర్శించిన థాయిలాండ్ బౌద్ధ భిక్షువులు

01-06-2025 09:01:57 PM

నాగార్జునసాగర్ (విజయక్రాంతి): నాగార్జునసాగర్ లోని బుద్ధ వనంను థాయిలాండ్ దేశపు బౌద్ధ బిక్షువులు అంతర్జాతీయ నటులు, సిద్ధార్థ గౌతమ పాత్రధారి గగన్ మాలిక్ ఆధ్వర్యంలో ఆదివారం సందర్శించారు. నాగార్జునసాగర్ లో తెలంగాణ టూరిజం(Telangana Tourism) అంతర్జాతీయ స్థాయిలో నిర్మించిన బుద్ధవనం మహా స్తూపంలో 2022 నవంబర్ 29వ తేదీన బుద్ధుని ధాతువులను ఇండోనేషియా దేశం నుంచి తీసుకువచ్చి బహుకరించిన మహాభాగ్యం గగన్ మాలికే దక్కుతుంది.

మరల ఆదివారం నాడు థాయిలాండ్ చెందిన బౌద్ధ బిక్షువులు గుల్బర్గాను సందర్శించిన అనంతరం వారితో పాటు కలిసి నాగార్జునసాగర్ లోని బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధ పాదాలు వద్ద పుష్పాంజలు ఘటించిన అనంతరం బుద్ధ చరిత వనం, జాతకవనం, ధ్యానవనం, స్థూపవనాలను సందర్శించి మహాస్తుభంలోని ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. వీరితో పాటు బుద్ధవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, బుద్ధ వనం మేనేజర్(ఆర్ట్, ప్రమోషన్స్), స్థపతి శ్యాంసుందర్రావు తదితరులు ఉన్నారు.