02-01-2026 12:44:46 AM
ఎమ్మెల్యేలకు జర్నలిస్టుల యూనియన్ వినతి
మేడ్చల్, జనవరి 1 (విజయక్రాంతి): జర్నలిస్టుల అక్రిడిటేషన్ జీవో నెంబర్ 252 పై అసెంబ్లీలో చర్చించాలని మేడ్చల్ జిల్లా టియుడబ్ల్యూజే, టీజేఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో జర్నలి స్టులు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానందును కలిసి విన్నవించారు. బోయిన్పల్లి లో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, కొంపల్లిలో కుతుబులాపూర్ ఎమ్మెల్యే వివేక్ నివాసాల్లో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ జీవో జర్నలిస్టులను విభజించేలా ఉందని, అంతేగాక పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు నష్టపోతారని వారు తెలిపారు. టియుడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కోల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి వెంకట్, స్టాఫ్ రిపోర్టర్లు రామారావు, రవి కిరణ్, భరత్ కళ్యాణ్, జిల్లా ఉపాధ్యక్షుడు సుగ్రీవుడు, సభ్యులు ఎర్రోళ్ల బాబు, ఎర్రోళ్ల కృష్ణ, సైదు లు పాల్గొన్నారు.