28 June, 2026 | 2:13 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

పది ఏళ్లుగా ఖాళీ కుర్చీ

05-05-2026 01:05 AM

ఆయుర్వేద వైద్యం లేక 20 గ్రామాల ప్రజల ఆవేదన 

తిరుమలాయపాలెం, మే 4 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని సుబ్లేడు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్యానికి గదులు ఉన్నప్పటికీ వైద్యుడు లేక కుర్చీ ఖాళీగానే ఉండటం పరిస్థితి దారుణంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత పది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్య సేవలు నిలిచిపోవడంతో చుట్టుపక్కల ఉన్న సుమారు 20 గ్రామాల ప్రజలు ఆయుర్వేద వైద్యం కొరకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.  నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఉన్నతాధికారుల సమక్షంలో సుబ్లేడు గ్రామ మాజీ సర్పంచ్ మందడి ఇజ్రాయిల్ వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించి ఆయుర్వేద వైద్యుని నియమించి ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు