24 August, 2026 | 9:53 PM

Breaking News

చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •   ఆపదలో ఉన్న కుటుంబానికి ఆర్థిక సాయం   •   చిలుకూరును డైరీ హబ్ గా తీర్చిదిద్దాలి   •   గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది   •   ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి   •   డ్రైవర్ కుటుంబానికి తోటి డ్రైవర్ల ఆర్థిక చేయూత   •   విద్యార్థులు కమ్యూనికేషన్, ఏఐ స్కిల్స్ పెంపొందించుకోవాలి   •  

పది ఏళ్లుగా ఖాళీ కుర్చీ

05-05-2026 01:05 AM

ఆయుర్వేద వైద్యం లేక 20 గ్రామాల ప్రజల ఆవేదన 

తిరుమలాయపాలెం, మే 4 (విజయక్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని సుబ్లేడు గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్యం అందుబాటులో లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆరోగ్య కేంద్రంలో ఆయుర్వేద వైద్యానికి గదులు ఉన్నప్పటికీ వైద్యుడు లేక కుర్చీ ఖాళీగానే ఉండటం పరిస్థితి దారుణంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత పది సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్య సేవలు నిలిచిపోవడంతో చుట్టుపక్కల ఉన్న సుమారు 20 గ్రామాల ప్రజలు ఆయుర్వేద వైద్యం కొరకు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.  నెలకొన్న ఇబ్బందులను పరిష్కరించాలని సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, ఉన్నతాధికారుల సమక్షంలో సుబ్లేడు గ్రామ మాజీ సర్పంచ్ మందడి ఇజ్రాయిల్ వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే స్పందించి ఆయుర్వేద వైద్యుని నియమించి ప్రజలకు అందుబాటులో వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు