01-06-2025 12:00:00 AM
న్యూఢిల్లీ, మే 31: ఆపరేషన్ సిందూర్పై ప్రజలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రజలను పూర్తిగా తప్పుదోవ పట్టిస్తుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. బ్లూమ్ బర్గ్కు ఇచ్చిన ఇంటర్య్యూలో త్రివిధ దళాల అధిపతి (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ ‘ మన ఫైటర్ జెట్లు కూలిన మాట వాస్తవమే’ అని చేసిన వ్యాఖ్య లే దీనికి నిదర్శనమన్నారు.
ఆపరేషన్ సిందూర్లో అసలు ఎన్ని ఫైటర్ జెట్లు కూలాయో లెక్క చెప్పాల్సిన అవసరముందని ఖర్గే డిమాండ్ చేశారు. కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. వెంటనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఆపరేషన్ సిందూర్కు సంబంధించి అన్ని వాస్తవాలు వెల్లడించాలని తెలిపారు.
భారత వాయుసేన ధైర్యాన్ని, సంకల్పాన్ని కాంగ్రెస్ పార్టీ అభినందిస్తుందని, అయితే రక్షణ సంసిద్ధతపై సమగ్ర వ్యూహాత్మక సమీక్ష అవసరమని పేర్కొన్నారు. డొనాల్ట్ ట్రంప్ ట్వీట్ తర్వాత శాంతి ఒప్పందం యొక్క నిబంధనలను మోదీ వెల్లడించడం లేదన్నారు. దీంతో భారత్, పాకి స్థాన్ మధ్య మళ్లీ హైటెన్షన్ వాతావరణం ఏర్పడుతుందేమోనని సందేహం వ్యక్తం చేశారు.