26-06-2025 12:40:52 AM
నగర పాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, జూన్ 25 (విజయ క్రాంతి): నగరపాలక సంస్థ లోని అన్ని విభాగాల అధికా రులు సమన్వయంతో నగర సమగ్ర అభివృద్ధి కోసం పనిచేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. బుధవారం నగరపాలక సం స్థ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి పె ట్టాలని అన్నారు. నాళాల్లో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి వరద నీరు ఎప్పటికప్పుడు వెళ్లిపోయేలా చూడాలని అన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేసే వారిపై నిఘా ఉంచి జరిమానా విధించాలని సూచించారు. అవసరమైన చోట పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని, వాటి నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కూడళ్ళలో అభివృద్ధి పనులు, డివైడర్ల నిర్మాణం, మొక్కల పెంపకం, వాటి నిర్వహణ వాటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. నగరంలోని పార్కులు, వాకింగ్ ట్రాక్స్ సమగ్ర నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అక్కడ పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదుల పట్ల ప్రత్యేక దృష్టి సారించి ప్రతి ఫిర్యాదును పరిష్కరించాలని ఆదేశించారు.
ప్రతి విభాగంలో ఫైళ్ల కదలికలో వేగం పెంచాలని, అధికారులు జవాబుదారితనంతో విధులు నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిప్యూటీ కమిషనర్లు వేణుమాధవ్, ఖాదర్ మొహినుద్దీన్, అసిస్టెంట్ కమిషనర్ సువార్త, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు యాదగిరి, సంజీవ్పాల్గొన్నారు.