calender_icon.png 22 June, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోడీ గారి పాలనలోనే దేశం సుభిక్షం..

14-06-2025 05:25:01 PM

పొనిశెట్టి వెంకటేశ్వర్లు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): మోడీ పాలనలో దేశం సుభిక్షంగా, అభివృద్ధి పదంలో కొనసాగుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి పోనిశెట్టి వెంకటేశ్వర్లు(Bharatiya Janata Party official spokesperson Ponisetty Venkateswarlu) అన్నారు. శనివారం పాల్వంచ పట్టణం లో బీజేపీ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.  మోడీ  11 సంవత్సరాల పాలన మీద ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.  దేశంలోని 4 కోట్ల పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టి, 81 కోట్ల కుటుంబాలకు రేషన్ బియ్యం ఇస్తున్నారన్నారు. 55 కోట్ల ప్రజలకు ఆయుష్మాన్ భారత్ పథకం క్రింద వైద్య సేవలు అందిస్తున్నారని, పీఎం కిసాన్ పథకం క్రింద రైతులకు రూ 3.7 లక్షల కోట్లు లబ్ది చేకూర్చరన్నారు. 

ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకం క్రింద రూ 1.75 లక్ష కోట్లు మంజూరు చేసినారనీ, రైతులకు మద్దతు ధర  150 శాతం పెంచిన ఘనత ఆయనదే అన్నారు.  490 కొత్త యూనివర్సిటీలు,8,100 కొత్త కాలేజిలు మంజూరు చేసి .1.6 కోట్ల యువతకు యుగ నైపుణ్యాలు అందిస్తున్నారన్నారు. దేశం అంతట 1.6 లక్షల స్టార్దప్ లు పెట్టి, 74 ఉండే విమానాశ్రయాలు  160 కి పెంచిన ఘనత బిజెపి దే అన్నారు. ప్రపంచం లోనే 4 వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ను తీర్చిదిద్ది, ప్రపంచం లోనే ఎతైన రైలు వంతెన చీనాబ్ వంతెన నిర్మాణం,130 ప్రపంచ స్థాయి వందే భారత్ రైళ్లు,  అమృత్ భారత్ రైల్వే పథకం క్రింద 1,300 రేల్వే స్టేషన్ల పునరాభివృద్ది చేపట్టారన్నారు.

 7 కొత్త ఐ ఐ టి లు, 8 కొత్త ఐ ఐ ఎం లు, 16 కొత్త ఎయిమ్స్ లు నిర్మించినారు. రూ 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు కల్పించారు. 5 నుండి 23 నగరాల కు మెట్రో రైళ్ల విస్తిరణ (248km -1000km ) చేసినారు. మహిళ సాధికారతకు 52.5 కోట్ల ముద్ర రుణాలు,90 లక్షల పైన స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, 10 కోట్ల గ్రామీణ మహిళలు స్వయం సంవృద్ధిగా ఎదగటానికి తోడ్పాటు అందించినారు. 12 కోట్ల కుటుంబాలకు టాయిలెట్స్ ,10 కోట్ల కు పైగా ఉజ్వల పథకం క్రింద గ్యాస్ కనెక్షన్లు,15.6 కోట్ల కుటుంబాలకు మంచి నీటి పంపు కనెక్షన్లు కల్పించినారు. జాతీయ రహదారులు 9100 నుండి 1,46 లక్షల కిలోమీటర్లకు నిర్మించినారు రోడ్డు రవాణా కు జాతీయ రహదారు లకు బడ్జెట్ లో 570 శాతం పెంపుదల చేసినారు. హిందువుల 500 ల సంవత్సరాల కళ అయోధ్య రామమందిరం నిర్మాణం చేసినారు దేశం నుండి తరలించ బడ్డ 642 కళ ఖండాలను తిరిగి మన దేశానికి తిరిగి తెచ్చినారు.

  740 కి పైగా నేరుగా కేంద్ర రంగ పథకాలు , 65 కి పైగా కేంద్ర ప్రయోజన పథకాలు మోడీ గారి నాయకత్వం లో అమలు అవుతున్నాయి అని అన్నారు కేంద్ర పథకాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వారి బొమ్మలు వేసుకొని ప్రచారం చేసుకుంటుంది అని ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని అన్నారు తెలంగాణ రాష్ట్రo లో కూడ డబుల్ ఇంజెన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు అని అన్నారు ఈ కార్యక్రమం బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ దున్నపోతుల రాజు,దాసరి రమేష్,సర్దార్ సురేష్ ,బత్తుల వెంకటేశ్వర్లు,భట్టు నరేష్,గుండు రాజు,మాదారపు లక్ష్మణ్,మాలోత్ ప్రశాంత్,కేసరి గిరి గౌడ్,sk నాగూర్ మీరా,మోహన్ రావు, కిట్టు,విజయ్,రాంబాబు,శేఖర్,రమేష్,రుద్ర,కిరణ్,సత్యం లు పాల్గొన్నారు.