calender_icon.png 15 June, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూచిపూడి నృత్యంలో గిన్నిస్ రికార్డు సాధించిన కామారెడ్డి జిల్లా అమ్మాయి

14-06-2025 05:26:45 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కూచిపూడి నృత్యం(Kuchipudi dance) పోటీలలో పాల్గొని గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ ను కామారెడ్డి జిల్లా(Kamareddy District) నిజాంసాగర్ మండలం మల్లూరు గ్రామానికి చెందిన ఓ బాలిక గిన్నిస్ రికార్డు లో పేరు నమోదు చేసుకున్నారు. కూచిపూడి నృత్యంలో కుమారి కుమ్మరి సాయి సహస్ర చిన్నారి గిన్నిస్ రికార్డు సాధించి  ఘనత సాధించారు. 3782 మంది కళాకారులతో లయబద్ధంగా కూచిపూడి ప్రదర్శన చేసినట్లు తెలిపారు. జమాత శబ్దం అంశంపై వినూత్న నృత్య ప్రదర్శన చేశారు.

23 డిసెంబర్ 2024న హైదరాబాదులోని బాలయోగి స్టేడియంలో నిర్వహించిన జమాత శబ్దం అంశంపై వినూతన నృత్య ప్రదర్శన 37 82 మంది కళాకారుల తో లయబద్ధంగా ఏడు నిమిషాల పాటు కూచిపూడి ప్రదర్శన నిర్వహించడం పట్ల గిన్నిస్ రికార్డు సాధించినట్లు తెలిపారు. శుక్రవారం హైదరాబాదులో నిర్వహించిన సమావేశంలో గిన్నిస్ రికార్డు సర్టిఫికెట్ను ను నిర్వాహకులు అందజేశారు. ఈ సందర్భంగా సాయి సహస్రను గ్రామస్తులు జిల్లా ప్రజలు అభినందించారు. మల్లూరు గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీలత నాగరాజుల కుమార్తె సాయి సహస్ర కూచిపూడి నాట్యంలో గిన్నిస్ రికార్డు సాధించడం పట్ల పలువురు అభినందించారు.