28-06-2025 01:23:08 AM
42% అమలుకు మార్గాల అన్వేషణ
- అధికారులు, న్యాయనిపుణులతో చర్చలు
- సుప్రీం కోర్టును ఆశ్రయించడమా? జీవో ఇవ్వడమా?
- ఒకవైపు కేంద్రంపై ఒత్తిడి.. మరొకవైపు న్యాయపోరాటం
- కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, జూన్ 27 (విజయక్రాంతి): స్థాని క సంస్థల ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వానికి అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. అయి తే సమస్యలన్నింటినీ అధిగమించి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తున్న ది. ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారిన బీసీల రిజర్వేషన్ అంశాన్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని యోచిస్తున్నది.
ఇందులో భాగంగా బీసీల కు 42 శాతం రిజర్వేషన్ సుసాధ్యానికి మార్గాలను అన్వేషించే పనిలోపడింది. నెల రోజుల్లోనే రిజర్వేషన్లు ఖరారు చేసి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలి యజేయాలని హైకోర్టు ఆదేశించడంతో ఏం చేయాలనేదానిపై ఆలోచనలు చేస్తున్నది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్కు ప్రధానంగా ఎదురయ్యే న్యాయపరిమితులపై ప్రత్యేకంగా దృష్టిసారించింది. అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన బిల్లు ఆమోదానికి ఒత్తిడి చేస్తూనే న్యాయపోరాటం చేసేందుకు సిద్ధపడుతున్నది.
ఒకవైపు ఒత్తిడి..
జూలై 21వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ బీసీ రిజర్వేషన్లపై చట్ట సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాలు రచిస్తున్నది.
అయితే నెల రోజుల్లోనే రిజర్వేషన్లను ఖరారు చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో గడువులోపు పార్లమెంట్లో చట్ట సవరణ సాధ్యం అవుతుందా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధంగా లేదనే అభిప్రాయాన్ని సీఎం రేవంత్రెడ్డి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో కేంద్రంపై ఒత్తిడి చేస్తూనే రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో జారీ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. అయితే జీవో అమలుచేస్తే ఎదురయ్యే న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటోంది. జీవో జారీచేస్తే చెల్లుబాటు కాకుండా అడ్డుపడే అంశాలపై ఆరా తీస్తున్నది.
ముఖ్యంగా న్యాయ పరమైన చిక్కులను ఎదుర్కొనేందుకు అడ్వకేట్ జనరల్ సలహా తీసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. న్యాయ నిపుణుల సలహాలు, సూచనల మేరకు సుప్రీం కోర్టును ఆశ్రయించడమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. బీసీల రిజర్వేషన్ అమలుపై న్యాయపోరాటానికి రంగం సిద్ధం చేస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేయాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించుకున్నది. అటు కేం ద్రం ప్రభుత్వం, రాష్ట్రపతి, ఇటు సు్ర పీం కోర్టు సహకరించని పక్షంలో ఎ న్నికలు నిర్వహించేందుకు ఏవిధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై ఆలోచనలు చేస్తుంది. గతంలో ప్రకటిం చిన విధంగానే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేస్తుంది.
ఈ క్రమంలోనే చట్టబద్ధంగా, న్యాయపరంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరకపోతే పార్టీ తరఫున ఇచ్చేందుకు కాం గ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహిం చి ప్రతిపక్ష బీజేపీ, బీఆర్ఎస్ల వైఖరిని ప్రజలకు వివరించేలా వ్యూహా లు రచిస్తున్నది. గత పదేళ్ల పాలనలో బీసీలకు ఉన్న 34 రిజర్వేషన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం 23 శాతానికి తగ్గిం చింది.
ప్రస్తుతం 42 శాతానికి పెంచాలని కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సహకరించడం లేదు. రిజర్వేషన్ల తగ్గింపు అంశంతో బీఆర్ఎస్ను, రిజర్వేషన్ పెంపునకు సహకరించడం లేదనే అంశంతో బీజేపీ పార్టీలకు చె క్ పెట్టాలని యోచిస్తున్నది. మొత్తంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పెంపుకు కాంగ్రెస్ యత్నిస్తోంది.