16-06-2025 12:00:00 AM
కలెక్టర్ అభిలాష అభినవ్
నిర్మల్, జూన్ 15 (విజయక్రాంతి): బాస ర గోదావరి నదిలో యాత్రికుల మృతిపై కలెక్టర్ అభిలాష అభినవ్ విచారం వ్యక్తం చేశారు. ఆదివారం ఆమె విడుదల చేసిన ప్రకటనలో హైదరాబాద్కు చెందిన భక్తులు బాసర దేవస్థాన దర్శనానికి వచ్చి గోదా వరిలో స్నానం చేస్తుండగా ఐదుగురు మృతి చెందడం దురదృష్టకరమని తెలిపారు.
గతం లోనే నది సమీపంలో మెట్లు ఏర్పాటుచేసిన ప్రాంతం మినహా ఇతర ప్రాంతాల్లో స్నానా లు నిషేధించామని పేర్కొన్నారు. భద్రతా పరంగా ఈ నిబంధనలను మరింత కఠినం గా అమలు చేస్తామని, ఇలాంటి సంఘట నలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే బైంసా ఆర్డీవోతో మాట్లాడినట్లు తెలిపారు. ఘటనపై సమీక్షించి, సహాయక చర్యలు తక్ష ణమే చేపట్టాలని అధికారులను ఆదేశించి నట్లు వెల్లడించారు. భక్తుల భద్రతకు సంబ ంధించి పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు.