17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

26 బీసీ కులాలను చేర్చే నిర్ణయం పునః సమీక్షించాలి

14-04-2025 12:25 AM

బీసీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ముషీరాబాద్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి) : ఏపీకి చెందిన 26 బిసి కులాలను తెలంగాణలో చేర్చే నిర్ణయాన్ని బీసీ కమిషన్ పునసమీక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కోరారు. ఈ మేరకు ఆదివారం బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో బీసీ-ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఎమ్మెస్ నరహరి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన బీసీ కులాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఆంధ్ర బీసీ కులాలను తీసుకొచ్చి తెలంగాణ బీసీ కులాలలో కలపడం సమంజసం కాదన్నారు.

ఏపికి చెందిన కొంతమంది పనిగట్టుకొని తెలంగాణ రాష్ట్ర బీసీ-ఏ కులాల్లోకి రావడానికి ప్రయత్నించడం బాధాకరమన్నారు. ఇక్కడ ఉన్న తెలంగాణ బీసీ కులాలను ఏపీలోని బీసీ కులాల్లో చేర్చేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా?  అని ఎదురు ప్రశ్నించారు. ఒకవేళ ఈ 26 బిసి కులాలను తెలంగాణ ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేర్చండని, తమకు అభ్యంతరం లేదని మల్లన్న తెలిపారు.

హైకోర్టు తీర్పును ప్రభుత్వం ఉల్లంఘించడం మంచిది కాదన్నారు. బీసీ కులాల మధ్య పంచాయతీ పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో బీసీ నేతలు ప్రొ.డా.భాగయ్య, కే.రామచందర్, ప్రొ.సాం బయ్య, ప్రొ.సాంబమూర్తి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు దుర్గా రాణి, పరమేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.