ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదింటి కల సాకారం
దామరగిద్దలో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే కాలె యాదయ్య
చేవెళ్ళ మే 3(విజయక్రాంతి): చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని దామరగిద్ద 9 వవార్డ్ లో డప్పు రాజు, బోడ పవన్ కు మంజూరైనా ఇందిరమ్మ ఇళ్లను గురువారం కౌన్సిలర్ తాళ్లపల్లి నర్సిములు, మాజీ సర్పంచ్ మధుసూదన్ గుప్తా ఆధ్వర్యంలో మున్సిపాలిటి చైర్మన్ దేవర సమతా వెంకట్ రెడ్డితో కలిసి స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదల ఇంటి కల సహకారం అయిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కట్టుబడి ఉన్నారన్నారు.
విడతలవారీగా పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మాజీ సర్పంచ్ శైలజ ఆగిరెడ్డి,డిసిసి ఉపాధ్యక్షులు ఆగిరెడ్డి,కౌన్సిలర్లు మద్దెల శ్రీనివాస్, గోపాల్ రెడ్డి,మధుసూదన్ రెడ్డి,నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్య గౌడ్, వైస్ చైర్మన్ బేగరి రాములు,మాజీ పిఏసిఎస్ లు చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, గోనె ప్రతాప్ రెడ్డి,మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్,
మండల్ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు లొంక శ్రీనివాస్ గౌడ్,మండల్ పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్, మాజీ సర్పంచ్ శంకర్, మాజీ సర్పంచ్ జాంగిర్,లియాకత్, ఖాదీర్, రవీందర్ రెడ్డి,ప్రతాప్ రెడ్డి, ప్రభు గుప్తా,మాల వెంకటయ్య,మాల నర్సిములు, పోతురాజు నవీన్, దొడ్డి మల్లేష్, అక్నాపూరం నర్సిములు, దొడ్డి అంజయ్య, దొడ్డి సత్తయ్య,మాచన్ పల్లి రాంచందర్, రాజేష్ గౌడ్, రమేష్ గౌడ్, బోడ ప్రకాష్, ప్రసాద్, డప్పు మహేందర్, డప్పు రత్న గ్రామస్థులు పాల్గొన్నారు.






