15 June, 2026 | 7:16 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

సమసమాజ స్థాపనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

03-06-2026 01:44 AM

బండి రమేష్.

కూకట్ పల్లి, మే2,(విజయక్రాంతి):సమ సమాజ స్థాపనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని బండి రమేష్ అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మంగళవారం కూకట్ పల్లి నియోజకవర్గం పరిధి బోయినపల్లి,బాలానగర్, ముసాపేట, అల్లాపూర్ డివిజన్ల పరిధిలో కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ముఖ్య అతిధిగా పాల్గొ ని జాతీయపతకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సకలజనుల పోరాటం తోనే తెలంగాణ రాష్ట్రం సాకారమయిందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో దోచుకోవటం దాచుకోవటం తరహా పాలన సాగిందని ద్వజమెత్తారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని, అభివృద్ధి సంక్షేమం ప్రధాన ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు. మహిళలను మహిళా స్వయం సహాయక సంఘాల సహకారంతో కోటి మంది మహిళలను కోటీశ్వ రులను చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు. 

మహిళలను కోటీశ్వరులను చేయడంలో భాగంగా పెట్రోల్ బంకులు, సూపర్ మార్కెట్లు, అద్దె బస్సులను కేటాయిస్తున్నామన్నారు. ప్రజా పాలనలో భాగంగా ఇల్లులేని ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, బ్లాక్ అద్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.