ప్రైవేట్ పాఠశాలలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి
ప్రైవేట్ పాఠశాలల దోపిడీ అరికట్టేది ఎవరు..?
భీమదేవరపల్లి, జూన్ 24 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలో విద్య హక్కు చట్టం ప్రైవేటు విద్యాసంస్థల్లో నిరుపేదలకు 25% ఉచిత విద్యను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెప్యాల ప్రకాష్ ఎద్దేవా చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వ నియంత్రణ చట్టాన్ని అమలు చెయ్యాలని ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు విపరీతంగా విచ్చలవిడిగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా వ్యాన్ ఫీజులు పెంచుతున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు కొన్ని పాఠశాలలకు పర్మిషన్ లేకుండా ఇష్టానుసారంగా విద్యను వ్యాపారం చేస్తూ పాఠశాలలకు తగినంత ప్లే గ్రౌండ్ లేక పిల్లలకు వ్యాయామం క్రీడలు నేర్పించడంలో పాఠశాల యజమాన్యం మక్కువ చూపడం లేదు అని అన్నారు, అదేవిధంగా ప్రవేట్ పాఠశాల యొక్క లక్ష్యం 10/10 స్టేట్ ర్యాంక్, జిల్లా ర్యాంకులకు పోటీపడే విధంగా పిల్లలను విపరీతంగా మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తూ బట్టి పట్టించే విధంగా విద్యా వ్యవస్థ యజమాన్యాలు నడుపుతున్నారు పిల్లలలకు అర్థమయ్యే రీతిలో సులభంగా చెప్పి అవగాహన కల్పించే విధంగా ఉండాలని కోరారు పిల్ అధికారులు ,ప్రజాప్రతినిధులు వాటిపైన శ్రద్ధ పెట్టకపోవడం వలననే వారి యొక్క ఫీజులు పెంచుకోవడం జరుగుతుంది.
ప్రైవేట్ పాఠశాలల య కన చేయడం సామాన్య ప్రజల రక్తం తాగుతున్నారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 000 పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేసే ఫీజులను నియంత్రించడానికి చర్యలు చేపట్టి ప్రభుత్వం అమలు చేసిన ఫీజుల ప్రకారమే అక్కడి పాఠశాలలు నడుస్తున్నాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఫీజు నియంత్రణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. వై . బహుజన్,రాష్ట్ర కార్యదర్శి కండె సుధాకర్ ,వేముల జగదీష్, గంగారపు రవి ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






