calender_icon.png 31 December, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయస్థాయి పోటీలకు విద్యార్థినులు ఎంపిక

31-12-2025 12:39:35 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 30(విజయ క్రాంతి): బెంగళూరులో డిసెంబర్ 31 నుండి జనవరి 4 వరకు నిర్వహించనున్న జాతీయ స్థాయి జూనియర్ బాలికల ఖోఖో పోటీలకు ఆసిఫాబాద్‌లోని గిరిజన క్రీడా పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు ఎంపిక య్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన జంగు బాయి, నాగేశ్వరి, వైష్ణవి, శ్రీలత, సోనీ జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబరావు, వ్యాయా మ ఉపాధ్యాయుడు బండ మీనారెడ్డి తెలిపా రు.

ఎంపికైన క్రీడాకారిణులను, శిక్షణ అందిస్తున్న ఖోఖో శిక్షకుడు వాసం తిరుమల్ను ఐటీ డీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యువరాజ్ మర్మాట్ ,గి రిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్. రమాదేవి అభినందించారు.ఈ కార్యక్రమంలో ఏసీఎంఓ ఉద్దవ్, క్రీడల అధికారి మడవి షేక్, జీసీడీఓ శకుంతల, ఏటిడీఓ శివకృష్ణ, హెచ్డబ్ల్యుఓ సాయిబాబా, పాఠశాల ఉపాధ్యాయు డు జంగు, శిక్షకులు అరవింద్, విద్యాసాగర్ క్రీడాకారిణులకు అభినందనలు తెలిపారు.