10 June, 2026 | 3:55 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

ఆకట్టుకున్న గ్రీన్ కోర్ ఎగ్జిబిషన్

31-12-2025 12:40 AM

మంచిర్యాల టౌన్, డిసెంబర్ 30 : మంచిర్యాలలోని జిల్లా సైన్స్ సెంటర్ లో మంగళ వారం జాతీయ గ్రీన్ కోర్ ఆధ్వర్యంలో ‘వేస్ట్ టు వెల్త్’ అనే అంశంపై నిర్వహించిన ఎగ్జిబిషన్ అందరిని ఆకట్టుకుంది. ఈ ఎగ్జిబిషన్ కు వివిధ పాఠశాల నుంచి దాదాపు 36 ఎగ్జిబిట్స్ రాగా ఎన్జీసీ రాష్ట్ర కోఆర్డినేటర్ విద్యాసాగర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించి విజేతలను ప్రకటించారు.

మొదటి విజేతగా మంచిర్యాల జడ్పీహెచ్‌ఎస్ (బాలికలు), చెన్నూర్ కేజీబీవీ రెండవ, బెల్లంపల్లి కేజీబీవీ మూడవ విజేతగా నిలిచారు. జిల్లా విద్యాధికారి ఎస్ యాదయ్య విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజగోపాల్, డీసీఈబీ సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక పాఠశాల హెచ్‌ఎం రమేష్, ఏసీజీఈ మల్లేష్, వివిధ పాఠశాలల విద్యార్థులు, గైడ్ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.