19-06-2025 12:10:59 AM
సిద్ధు జొన్నలగడ్డ రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’తో అలరించబోతున్నారు. ఈ సినిమాతో ప్రముఖ స్టుటైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ మూవీ చివరి షూటింగ్ షెడ్యూల్ బుధవారం ప్రారంభమైంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్లో సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధిశెట్టిలపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ 17న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: థమన్; డీవోపీ: జ్ఞానశేఖర్ బాబా.