3 April, 2026 | 3:12 AM

తెలుగులో తొలి ఏఐ సినిమా అంబ’S రివేంజ్

03-04-2026 12:00 AM

పూర్తిస్థాయి కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందుతున్న తొలి తెలుగు చలనచిత్రం ఒకటి ప్రేక్షకుల ముందుకు రానుంది. “అంబ’s రివేంజ్‌” పేరుతో ఈ చిత్రాన్ని శ్రీ లలితకళా చిత్రాలు, నక్క తోక ఫిలమ్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీకాంత్‌రెడ్డి కుందూరు నిర్మాత కాగా, జయవర్ధన్ మాడి క్రియేటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ పౌరాణిక చిత్రాన్ని మహాభారతంలోని శక్తిమంతమైన పాత్ర అంబ కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

హనుమాన్ విజయోత్సవం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ గురువారం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీకాంత్‌రెడ్డి కుందూరు, క్రియేటివ్ డైరెక్టర్ జయవర్ధన్ మాడి మాట్లాడుతూ.. “తెలుగు చలన చిత్ర పరిశ్రమలో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాం. అంబ’s రివేంజ్ ప్రాజెక్టు కోసం అత్యాధునిక ఏఐ టూల్స్‌ను వినియోగిస్తూ విజువల్స్, పాత్రల రూపకల్పన, కథన నిర్మాణం వంటి అంశాలను కొత్త శైలిలో ఆవిష్కరిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తాం” అని తెలిపారు.